ఐపీఎల్ : నేడు మరో బిగ్ ఫైట్.. ఎవరు గెలుస్తారో?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా శని ఆదివారాల్లో రెండు రోజులపాటు  రెండు మ్యాచ్లు జరగడంతో  క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీల ముందు నుంచి పక్కకు జరగలేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లను కన్నార్పకుండా చూసి అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందారు. ఇకపోతే నేడు కూడా ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగబోతుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న రెండు జట్ల మధ్య పోటీ జరగబోతుంది. ఆ రెండు జట్లు ఏవో కాదు కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.

 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు బరిలోకి దిగుతూ ఉండగా సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మైదానంలో పోరాడేందుకు సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్  స్టేడియం వేదికగా  సాయంత్రం  7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కూడా ఐదు ఆరు స్థానాలలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడగా.. మూడింట్లో విజయం సాధించింది. రెండింట్లో ఓటమి చవి చూసింది.. కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా.. మూడింట్లో విజయం సాధిస్తే మూడు మ్యాచ్లలో ఓడిపోయింది.

 ఇక ఈ రెండు జట్ల మధ్య గత రికార్డులను చూసుకుంటే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ పై 13 విజయాలతో ఆధిపత్యాన్ని  కొనసాగిస్తుంది. అయితే అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 11 విజయాలతో గట్టిపోటీని ఇచ్చింది. ఈ రెండు జట్లు తలపడ్డ చివరి తొమ్మిది మ్యాచ్ లలో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ లో గెలిచి సత్తా చాటింది. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: