ఐపీఎల్ : నేడు మరో బిగ్ ఫైట్.. ఎవరు గెలుస్తారో?
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు బరిలోకి దిగుతూ ఉండగా సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మైదానంలో పోరాడేందుకు సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కూడా ఐదు ఆరు స్థానాలలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడగా.. మూడింట్లో విజయం సాధించింది. రెండింట్లో ఓటమి చవి చూసింది.. కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా.. మూడింట్లో విజయం సాధిస్తే మూడు మ్యాచ్లలో ఓడిపోయింది.
ఇక ఈ రెండు జట్ల మధ్య గత రికార్డులను చూసుకుంటే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ పై 13 విజయాలతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అయితే అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 11 విజయాలతో గట్టిపోటీని ఇచ్చింది. ఈ రెండు జట్లు తలపడ్డ చివరి తొమ్మిది మ్యాచ్ లలో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ లో గెలిచి సత్తా చాటింది. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..