ఒలంపిక్స్ లో రజతం గెలిచిన రెజ్లర్ కు 2 కోట్లు ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం...
ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే మేము మన దేశంలోని ఆరుగురు వీరులను సత్కరిస్తున్నాము. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు మాకు కుటుంబం లాంటి వారని మేము ఎప్పుడూ చెబుతాము. మన కుటుంబంలోని ఒక పిల్లవాడు ఏదైనా ఒక పనిలో రాణిస్తే, కుటుంబం మొత్తం ఉల్లాసంగా మరియు గర్వంగా అనిపిస్తుంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదే విధంగా, మా కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు పిల్లలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసారు. ఈ వేడుక కేవలం మా అద్భుతమైన అథ్లెట్లకు వారి అసాధారణ విజయాలు మరియు మన దేశానికి పేరు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపెంచుకు ఇది మాధ్యమం అన్నారాయన.
అయితే టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించినందుకు రెజ్లర్ దహియాకు రూ. 2 కోట్ల చెక్కును అందజేయగా, పారాలింపిక్స్లో హైజంప్ లో కాంస్య పతకం సాధించినందుకు అథ్లెట్ శరద్ కుమార్కు కోటి రూపాయల చెక్కును అందజేశారు. కాశీష్ లక్రా, సిమ్రాన్లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, సార్థక్ భాంబ్రీ, అమోద్ జాకబ్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.