50 పరుగులు, 5 వికెట్లు.. అదరగొట్టిన అనుష్క శర్మ.. కోహ్లీ షాక్?

praveen
భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అనుష్కశర్మ క్రికెట్ లో అద్భుతంగా రాణించింది. ఏకంగా 88 బంతుల్లో 52 పరుగులు చేసింది. అంతేకాదు బంతితో కూడా రాణించి ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది.. ఇక అటు మైదానంలో ఫీల్డింగ్ సమయంలో కూడా ఎంతో పాదరసంలా కదులుతూ  అదరగొట్టింది. ఆగండాగండి విరాట్ కోహ్లీ గురించి చెప్పబోయి పొరపాటున అనుష్క అని చెబుతున్నారు కదా అని అంటారా.. కాదు కాదు మనం మాట్లాడుకునేది నిజంగా అనుష్క శర్మ గురించే. మరి అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడటమేంటి అని అవాక్కవుతున్నారు కదా..

 అనుష్క శర్మ క్రికెట్ లో అదరగొట్టింది అన్న విషయాన్ని తెలుపుతూ ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. అయితే ఎవరో ట్రోల్ చేసే వారు ఇలాంటి ట్వీట్ పెట్టారు అనుకుంటే మాత్రం పొరబాటే.. ఎందుకంటే ఈ ట్వీట్ పెట్టింది ఏకంగా బీసీసీఐ. ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నారు కదా అనుష్క శర్మక్రికెట్ ఆడటం ఏంటీ.. అది కూడా భారీగా పరుగులు చేయడం.. 5 వికెట్లు పడగొట్టడం ఏంటి అనే కన్ఫ్యూషన్ ఎక్కువ అయిపోతుంది కదా.. అయితే మనం మాట్లాడుకుంటుంది భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి కాదు. భారత మహిళా క్రికెటర్ అనుష్క శర్మ గురించి ఆమె పూర్తి పేరు అనుష్క బ్రిజ్ మోహన్ శర్మ.

 ప్రస్తుతం ఈ మహిళా క్రీడాకారిణి అండర్ 19 క్రికెటర్ గా కొనసాగుతుంది. మహిళల అండర్ 19 వన్డే చాలెంజర్ ట్రోఫీ టోర్నమెంట్లో ఒక జట్టు కెప్టెన్గా కొనసాగుతుంది ఈ మహిళా క్రికెటర్. టీం బి కి కెప్టెన్గా కొనసాగుతోంది. కాగా ఇటీవలే అద్భుతంగా రాణించింది ఈ మహిళా క్రీడాకారిని. ఈ క్రమంలోనే అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసింది. తర్వాత బంతితో కూడా రాణించి ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. మైదానంలో కూడా ఎంతో పాదరసంలా కదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది బిసిసిఐ. ఇక ఇది చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: