దాయాదుల సమరం : హార్దిక్ పాండ్యా vs పాకిస్తాన్?
ఈ నేపథ్యంలో ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇప్పటికే ఈ మ్యాచ్ పై భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి అయితే దుబాయ్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఎవరు ఎలా రాణిస్తారు అనే దానిపై అటు భారత మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్తో మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టి20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ పై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ విశ్లేషించాడు. ఈ మ్యాచ్లో తన మొదటి ఎంపికగా హార్దిక్ పాండ్యా అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్లో రాణించాడు అంటే పాకిస్తాన్ పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉంటే ఇక పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ ని కచ్చితంగా ఏకపక్షంగా మార్చగలడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి బౌలింగ్ కి దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో బౌలింగ్ చేస్తాడా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.