దాయాదుల సమరం: చరిత్రలో మొదటిసారి... ఏమిటో తెలిస్తే షాక్?

VAMSI
ఈ రోజు ఒక భారతీయ క్రికెట్ ప్రేమికులకు పండుగ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో క్రికెట్ ను ఎంతగా అభిమానిస్తారు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ లు ఒకరితో ఒకరు ద్వైపాక్షిక సీరీస్ లు ఆడుతూ ఉండేవారు. కానీ తర్వాత రెండు దేశాలకు మధ్యన కొన్ని రక్షణ పరమైన కారణాల వలన రెండు దేశాల మధ్యన జరిగే ద్వైపాక్షిక సీరీస్ లు పూర్తిగా ఆగిపోయాయి. అప్పటి నుండి కేవలం ఐసీసీ నిర్వహించే వన్డే ప్రపంచ కప్ మరియు టీ 20 వరల్డ్ కప్ లలో మాత్రమే తలపడుతున్నాయి. అందుకని ఎప్పుడో ఒకసారి తలపడే ఇరు జట్ల మధ్యన జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది.
ఈ రోజు టీ 20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 లో భారత్ తన మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. ఆ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మ్యాచ్ గురించి మామూలు సందడి లేదు. ఇది 22 మంది ప్లేయర్ ల మధ్యన జరిగే మ్యాచ్ లా అనిపించడం లేదు. రెండు దేశాలలోని కోట్ల మంది ప్రజలందరి మధ్యన జరిగే మ్యాచ్ లా అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి మ్యాచ్ ముగిసే వరకు ఇదే బజ్ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచేది  ఇండియానే అని రికార్డులు చెబుతున్నా, పాకిస్తాన్ మాత్రం గెలిచేది మేమే అంటూ హంగామా చేస్తున్నారు.
మరి ఎవరు గెలుస్తారో అన్నది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ కు సంబంధించి ఒక వార్త సంచలనం రేపుతోంది. చరిత్రలో ఇప్పటి వరకు ఈ మ్యాచ్ కు లేని అరుదైన ఘనతను ఈ మ్యాచ్ సొంతం చేసుకోబోతోంది. ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు మొత్తం 200 దేశాల్లో ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు ఏ రేంజ్ లో టీఆర్పీ రానుందో అన్నది చూడాల్సి ఉంది. ఇక మన దేశంలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ మరియు హాట్స్టార్ లో ప్రత్యక్షముగా వీక్షించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: