టీ 20 : ఈ సారి 16 జట్లు ! ఫార్మెట్ ఎలా ఉంటుంది?
ఈ మహా సంగ్రామం రెండు రౌండ్లలో నిర్వహించబోతున్నారు. మొదటి రౌండ్ లో ఎనిమిది జట్లు ఉంటాయి. అయితే వీటిని నాలుగు నాలుగు జట్ల గా రెండు గా విభజిస్తారు. అందులో గ్రూప్ ఏ నుంచి శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్, నమీబియా జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్ బీ లో బంగ్లాదేశ్ తో పాటు స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ ఉంటాయి. గ్రూప్ లో ఉన్న ప్రతి జట్టు మిగత ప్రతి జట్టు తో తల పడుతాయి. అలా రెండు గ్రూప్ లో టాప్ రెండు గా ఉన్న జట్లు సూపర్ 12 అనగా.. రెండో రౌండ్ కు అర్హత సాధిస్తాయి. అక్కడి ఈ నాలుగు జట్లతో పాటు ఎనమిది అగ్ర శ్రేణి జట్లతో మళ్లి రెండు గ్రూప్ లు గా విభజిస్తారు. ఈ రెండో రౌండ్ లో గ్రూప్ ఏ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు ఏ1 బీ2 జట్లు ఉంటాయి. అలాగే గ్రూప్ బీ లో ఇండియా, పాకిస్ధాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు బీ1, ఏ2 జట్లు ఉంటాయి.
ఈ రెండో రౌండ్ లో కూడా ప్రతి జట్టు తన గ్రూప్ లో ఉన్న మిగితా జట్టు తో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇలా రెండు గ్రూప్ లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీ ఫైనల్ కు చెరుతాయి. దీని తర్వాత నవంబర్ 14 న ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అలాగే ఈ మెగా టోర్ని ఫైనల్ లో గెలిచిన వారికి 1.6 మిలియన్ డాలర్లు అనగా రూ. 12.02 కోట్లు ఇస్తారు. అలాగే రన్నరప్ కు రూ. 6 కోట్లు గెలుచు కుంటుంది. దీని తో పాటు సెమీ ఫైనల్ కు వచ్చిన జట్ల కు రూ. 3 కోట్లు దక్కనున్నాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండిస్, భారత్ తో పాటు న్యూజీలాండ్, పాకిస్థాన్ జట్లు మంచి ఫాం లో ఉన్నాయి. ఈ టీమిండియా మెంటర్ గా ఎమ్ ఎస్ ధోని వస్తుండటం తో టీమిండియా పై అంచనాలు భారీగా పెరిగాయి.