దేవీ నవరాత్రులలో అమ్మవారి ప్రసాదములు..తయారు చేసే విధానం

DRK Raju
దేవీ నవరాత్రులలో  అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం తెలుసుకుందామా..మొదటి రోజు.. శ్రీ బాలత్రిపురసుందరిదేవి..పొంగల్.. కావలసినవి ..పెసరపప్పు 150 గ్రాం,  కొత్త బియ్యం 100 గ, మిరియాలు 15 ,  పచ్చిమిరప కాయలు 6 ,  పచ్చి కొబ్బెర 1 కప్ , కాచిన నెయ్యి 1/4 కప్, జీడిపప్పు 15 ,  జీర 1/2 టేబల్ స్పూన్ , ఆవాలు 1/4 టేబల్ స్పూన్ , ఎండుమిర్చి 3 ,  మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్ , కోత్తమిర , కరేపాకు , తగినంత ఉప్పు రుచిని బట్టి, ఇంగువ 2 చిటికెళ్ళు. చేయవలసిన విధానము..దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిముషాలు వేపితే చాలు. పెసరపప్పు కూడ కలర్ మారకూడదు. అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర   కోరి, జీలకర్,  మిరియాలు  వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో వుంచి 3 విజిల్స్  / కూతలు వచ్చాక ష్టవ్  కట్టివేయడం చేయండి. చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు , శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసివేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి  భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి. 


రెండవ రోజు .గాయత్రి దేవి అవతారం.. ఆ రోజు పులిహోర.. దానికి కావలసినవి ఏటంటే..బియ్యం 150 గ్రాం, చింతపండు 50 గ్రాం, పసుపు1/2 స్పూన్ , ఎండుమిర్చి 5 ,  ఆవాలు 1/2 స్పూన్ , మినపప్పు 1 స్పూన్, శనగ పప్పు 2 స్పూన్, వేరు శనగ పప్పు 1/2 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, ఇంగువ చిటికెడు, నూనె 1/4 కప్పు, ఉప్పు తగినంత ,బెల్లం కొద్దిగా తీసుకోవాలి. చేయవలసిన విధానం..అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి.  చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి. మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్లో ) వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి. బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము. 


మూడవ రోజు అన్నపూర్ణా దేవి..కొబ్బరన్నం.. దానికి కావలసినవి..బియ్యం 1/2 కిలో, తురిమిన పచ్చికొబ్బెర 1 కప్, పచ్చిమిర్చి 5 ,  కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ , జీడి పప్పు 10 ,  నూనె , 1/4 కప్, నెయ్యి 1 టెబల్ స్పూన్. 
చేయవలసిన పద్ధతి..అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి. అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన  పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర , అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదం తా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం సిద్ధం.  శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులవుదాం.


నాల్గవ రోజు లలితా దేవి అమ్మవారికి అల్లం గారెలు.. దానికి  కావలసినవి..మినపప్పు2 కప్స్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరప కాయలు 6 , సన్నగా తరిగినవి, జీరా 1/4 స్పూన్, ఉప్పు రుచికి తగినంత,  కరేపాక్ , కోత్తమిర తగినంత, నూనె గారెలు వేయించేందుకు.
చేసే విధానం..మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి (లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి). నానిన మినపప్పును గ్రైండర్లో వేసి  , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగిన తర్వాత కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని గుండ్రంగా  అదిమి నూనెలో వేయాలి. దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవికి  ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాం.



ఐదవ రోజు సరస్వతి పూజ..పెరుగన్నం, దద్ధోజనం..కావలసినవి..బియ్యం 1/4 కిలో పాలు 1/2 లీ, చిక్కటి పెరుగు 1/2 లీ, నూనె 1/2 కప్పు, నెయ్యి 1 స్పూన్, కొత్తమిర , కరివేపాకు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, పోపు సామాగ్రి, జీడిపప్పు 20 ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి. 
చేసే విధానం..ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి. సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి కాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీ వేయండి.  రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.



ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి..రవ్వ  కేసరి కి కావలసినవి..రవ్వ 1 కప్, షుగర్ 3/4 కప్, నెయ్యి 2 టెబల్ స్పూన్, కేసరి కలర్ / చిటికెడు. యాలకులు 4 ,  ఎండు   ద్రాక్షా 6 , జీడిపప్పు 10 ,  మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1), వాటర్ 1/2 కప్. చేసే విధానం ..ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ  దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి . మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండు ద్రాక్ష వేయించి తీసి వుంచండి. .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి. అందులో కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి.



ఏడవ రోజు దుర్గాదేవి..కదంబం ప్రసాదం.. కావలసినవి..కందిపప్పు 1/2 కప్, బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ).1 వంకాయ,  1/4 సొర్రకాయ, 1 దోసకాయ,  బీన్స్ తగినన్ని, 1 పోటాటో, వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు, 2 మొక్కజొన్నలు, 1/2 క్యారెట్, 2 టోమాటో, తగినంత కరివేపాకు, కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప, 4 పచ్చి మిర్చి, నూనె తగినంత,  నెయ్యి చిన్న కప్పు, చింతపండు గొజ్జు తగినంత, కాస్త బెల్లం ( జాగిరి ), ఉప్పు , పసుపు తగినంత, 3 చెంచాలు సాంబర్ పౌడర్, పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ.  చేయవలసిన విధానము..ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్  ఆఫ్  చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగా  ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తర్వాత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్లోవేసి, కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. 



ఎనిమిదవ రోజు మహిషాసుర మర్ధిని.. బెల్లం అన్నం కావలసినవి..బియ్యం 100 గ్రాం, బెల్లం 150 గ్రాం , యాలకులు 5 , నెయ్యి 50 గ్రాం, జీడిపప్పు 10 . చేసే విధానం..ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి . అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపిదించేయడమే . తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృపకు పాత్రులవుదాం. తొమ్మిదవ రోజు  రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం .. పరమాన్నం.. కావలసినవి..చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్, షుగర్  1,1/2 కప్స్, ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్, ఏలకలుపౌడర్ 1/2 స్పూన్, నెయ్యి  5 టేబల్ స్పూన్స్.  చేసే విధానం..ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త  నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి. తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త  నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష.  ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి ( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టాలి. పడవ రోజున ప్రధాన దేవతను సర్వాభరణములతో  అలంకారం చేయాలి. ఆ రోజు ఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా పెట్టాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: