స్మరణ: జయలలిత ఆ క్రికెటర్ అంటే పిచ్చితో ఎం చేసిందో తెలుసా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జయలలిత. ఆమె ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి దాదాపుగా స్టార్ హీరోలతో సమానమైన స్టార్ డమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళం, కన్నడ అనే భాషలో తేడా లేకుండా అన్ని భాషలలో నటించి అగ్ర కథానాయికగా తన సత్తా చాటుకుంది. ఆమె అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను సైతం మంత్రముగ్దులను చేసింది.
ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించిన జయలలిత.. అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఆమె రాజకీయ రంగంలో ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో గెలిచి ప్రభంజనం సృష్టించారు. అంతేకాదు.. ఆమె కొన్ని సార్లు అవమానాల పాలైయ్యారు. ఇక  తమిళనాడు వాసులు ఆమెను ముద్దుగా అమ్మగా పిలుస్తుండేవారు. ఇక ఇలా జీవితంలో ఎన్నో సాధించిన జయలలితకు చిన్నప్పటి నుండి క్రికెట్ ని చాలా ఇష్టపడేది.
ఆమె చిన్నప్పటి నుంచి క్రికెట్ కి సంబంధించి ఎటువంటి ఫోటో పేపర్లో వచ్చిన దానిని కత్తిరించి తన డైరీలో భద్రంగాదాచుకుంటూ ఉండేదంట. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగి రాణిస్తున్న రోజుల్లో క్రికెట్ వస్తోందంటే చాలు అలాగే చూస్తూ  ఉండిపోయేవారంట. అంతేకాదు.. సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో ఏదైనా మ్యాచ్ జరుగుతోందంటే చాలు.. ఆమె అక్కడికి వెళ్లి తప్పకుండా ఆ మ్యాచ్ ను తన స్నేహితులతో వీక్షించేది.
అంతేకాదు.. ఆమె క్రికెటర్లను కలిసి వారి ఆటోగ్రాఫ్ లను ఫోటోలను తీసుకుంటూ ఉండేదంట. అయితే టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే జయలలితకు చాలా ఇష్టం. ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పుడే అతనికి ఎన్నోసార్లు కలిశారంట. ఇక  ఈ విషయాన్ని తనే స్వయంగా తన డైరీలో రాసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: