మంచి మాట : ధర్మశాస్త్రం ప్రకారం మానవులు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

Divya

1. పరిగెత్తే వారికి, ఆవలించేవారికి, తల స్నానం చేస్తున్న వారికి నమస్కారం పెట్టకూడదు.
2. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, భర్త నదీస్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే పర్వతారోహణము , క్షౌరము చేయరాదు.
3. స్త్రీలను స్నానం చేసేటప్పుడు, కాటుక పెట్టుకునేటప్పుడు అరవకూడదు.
4. సూర్యుడు ఉదయించేటప్పుడు అలాగే అస్తమించేటప్పుడు నీళ్లలో ఆ నీడను, అద్దంలోను చూడకూడదు.
5. నీటిలో తన నీడను తానే చూడడం, రాత్రిపూట చెట్ల కొమ్మల ఆకులను కోయడం, రాత్రిపూట నీటి బావిలో నుంచి నీళ్ళు తోడడం వంటివి చేయకూడదు.
6. తలకు, శరీరానికి నూనె రాసుకుని మలవిసర్జన, మలమూత్రాలు చేయరాదు.
7. భోజనం చేస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను, ఆవలిస్తున్న భార్యను చూడరాదు. ఒకవేళ అలా చూడాల్సిన పరిస్థితి వస్తే, ముఖం పక్కకు తిప్పుకుంటే సరిపోతుంది.
8. పొరపాటున నేల కుంకుమ జారితే అపవిత్రం అనుకోకూడదు. కుంకుమను భూమాతకు కూడా పెట్టి తీసుకోవడం ఉత్తమం .
9. స్త్రీలు ఇతరులకు కుంకుమ పెట్టేటప్పుడు చూపుడువేలు మాత్రమే ఉపయోగించాలి. తమకు తాము పెట్టుకునేటప్పుడు  మధ్యవేలు ఉపయోగిస్తే ఉత్తమం.
10. ఎవరికీ చేతికి ఉప్పును ఇవ్వరాదు. ఇక మంగళ, శుక్రవారాలు సాయంత్రం పూట ఉప్పును ఇతరులకు ఇవ్వరాదు.
11. ఉదయాన్నే చాలామంది లేవగానే అద్దంలో తమ ముఖం చూసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.అలా చేయకూడదు. ఇక లేచిన వెంటనే నేతిలో ముఖాన్ని చూసుకోవడం వల్ల ఎక్కువకాలం జీవిస్తారు.
12. ఇక ప్రతిరోజూ పడుకునే ముందు ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రించరాదు. తూర్పు, పడమర ,దక్షిణ దిక్కులు నిద్రించడానికి సౌఖ్యము.
13. ఎవరైనా స్త్రీలు భగవంతుని వరం అడిగేటప్పుడు కేవలం మూడు వరాలు మాత్రమే కోరుకోవాలి. ఇలా ఎందుకంటే మహాభారతంలో ధృతరాష్ట్రున్ని ద్రౌపది కేవలం రెండు కోరికలను  మాత్రమే కోరింది. ఆయన మరో కోరిక కోరుకో అడిగినప్పటికీ కూడా ఆమె కోరుకోలేదు. కానీ ఆమె గురించి తెలిసిన ధృతరాష్ట్రుడు ఆమెకు మూడో వారం కూడా ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: