చంద్ర బాబు: ఆరోగ్యశ్రీ పేరు కూడా మార్చబోతారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల తీరు ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అధికారంలో ఉంటే వారిదే హవా అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఆరోగ్యశ్రీ అనేది చాలామంది పేద కుటుంబాలకు మంచి చేస్తూనే ఉంది.. పేర్లు మార్పు అనే విషయం కూడా ఎన్నో సందర్భాలలో జరిగింది. మరి ఈ విషయంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రతి విషయానికి కూడా జగనన్న గోరుముద్ద, జగనన్న చేయూత, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, ఇతరత్రా పేర్లతో కేవలం వైయస్సార్ లేదా జగన్మోహన్ రెడ్డి పేర్లు మాత్రమే ఉన్నవి.

ఒకప్పుడు ఇందిరా, రాజీవ్ గాంధీ వంటి పేర్లు కూడా ఇలాగే వచ్చేవి.. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టినట్లు తెలియడంతో వాటిని వ్యతిరేకించిన వైసీపీ పార్టీ ఇప్పుడు జగన్ పేరు రాజశేఖర్ రెడ్డి పేరు తప్ప ఏం లేకుండా చేశారు. గడచిన కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేర్లను కూడా మార్చారు. వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు కూడా పెట్టారు. అయితే అలాంటివి చట్టబద్ధంగానే చేశారు.

ప్రస్తుతం రకరకాల ఇష్యూస్ కూడా తెరమీదకి వస్తూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వైయస్సార్ పేరు మీద ఉన్నది.. తాజాగా ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో కలిగి ఉన్నటువంటి బోర్డుని టిడిపి నేతలు అక్కడ తగిలించారు. దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఇకపై దీనిని ఎన్టీఆర్ పేరుతోనే కొనసాగుతుందని నినాదాలను కూడా చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ కళాపాలు కొనసాగినాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పెట్టారు. ఇప్పుడు తాజాగా వైయస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో టిడిపి నేతలు ఏర్పాటు చేశారు. ఈ విషయం పైన చంద్రబాబు కూడా ఓకే అంటారా లేకపోతే ఏదైనా తటస్థ పేరు పెడతారా అనే విషయం చూడాలి. అయితే ఈ ఆరోగ్య శ్రీ అనేది వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యింది. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కూడా ఉండేది ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ అని కూడా వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: