కొడుకు గెలుపు వేళ.. పవన్ తల్లి షాకింగ్ నిర్ణయం..!

Divya
ఆంధ్రప్రదేశ్ 2024 ఫలితాలు నిన్నటి రోజున విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూసి పలువురు పార్టీ అధినేతలు కూడా షాకీ గురయ్యారు.. ముఖ్యంగా 175 స్థానాలు ఉండగా ఇందులో 135 స్థానాలు టీడీపీ పార్టీ గెలిచింది 21 స్థానాలలో పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క స్థానాలను కూడా గెలిచింది.. అలాగే బిజెపి 8 స్థానాలను దక్కించుకోవడం గమనార్హం..అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు కూడా ఆనందాన్ని తెలియజేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజినమ్మ మాట్లాడడం జరిగింది.

పవన్ కళ్యాణ్ తల్లి అంజినమ్మ మాట్లాడుతూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పడ్డ కష్టానికి ఆ దేవుడు మంచి ఫలితాలను ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉంది. దీంతో తాను ఈరోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతానంటూ పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గాజు గ్లాస్ ని ఆమె చూపించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

ఈ వీడియో ప్రస్తుతం మెగా అభిమానులను పవన్ అభిమానులను సైతం తెగ వైరల్ గా చేస్తుంది. చిరంజీవి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గెలిచినందుకు చాలా సంబరాలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మెగా హీరోలు కూడా నానా హంగామా చేస్తున్నారు మరొకపక్క జనసేన అధినేత మాత్రం హైదరాబాద్ నుంచి హుటాహుటిగా మంగళగిరి కి వెళ్లి అక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడి చంద్రబాబుతో భేటీ అయి.. అనంతరం ఏ ఏ పనులు చేయాలనే విషయం పైన కూడా మాట్లాడే విధంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీకి మాత్రం ఈసారి ఎన్నికలు చాలా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అంతేకాకుండా సీఎం జగన్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: