కేతిరెడ్డి: పరాజయంతో మూగబోయిన గుడ్ మార్నింగ్..!

Divya

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల కష్టాలను తెలుసుకొని.. పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి.. 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి గోనుగుంట్ల సత్యనారాయణ పై ఏకంగా 15, 286 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు కేతిరెడ్డి..
ఇక్కడ మొత్తం 4 రెవెన్యూ డివిజన్స్ తో పాటు7  మండలాలు ఉన్న ఈ ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి బిజెపి తరఫున సత్య కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.. అయితే ఇక్కడ టిడిపి తరఫున టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కి టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు అసహనం వ్యక్తం చేసిన ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనే పంతంతో.. సత్యకుమార్ యాదవ్ కు పరిటాల శ్రీరామ్ మద్దతు పలుకుతున్నారు.. స్థానికంగా కమ్మ, బలిజ , బిసి సామాజిక వర్గాల ఓట్లు అండగా ఉన్నాయి. పైగా  ఇక్కడ  దాదాపు యువత మొత్తం ఈయన వైపే మొగ్గు చూపుతున్నారు.. మరొకవైపు టిడిపి యాంటీతో పాటు.. కేతిరెడ్డి సేవలను అందుకున్న చాలా మంది ప్రజలు కేతిరెడ్డి వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలోని నువ్వా నేనా అంటూ పోటీ గట్టిగా జరగబోతోంది. మరి మే 13న జరిగిన ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారన్న విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపింది..
తాజాగా నేడు అనగా జూన్ 4 2024 న తుది ఫలితాల లో ఎవరు గెలిచారు అనే విషయానికి వస్తే.. బిజెపి నేత సత్య కుమార్ యాదవ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై 2974 ఓట్ల తేడాతో గెలిచారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: