ఉరవకొండ: పయ్యావుల కేశవ్ గెలుపు.. బ్రేక్ చేసిన సెంటిమెంట్..!
మరొకవైపు వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి కి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ఈయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.. అంతకుముందు కాంగ్రెస్ తరపున పోటీ చేసినా సరే అధికారంలోకి రాలేకపోయారు.. దీంతో ఎలాగైనా సరే ఒకసారి అవకాశం ఇవ్వాలని ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ఆశించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా వై విశ్వేశ్వర్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ఇక అటు పయ్యావుల కేశవ ఇటు వై విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య పోటీ గట్టిగానే సాగింది. మే 13వ తేదీన జరిగిన ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ లో కూడా వై విశ్వేశ్వర్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు సమాచారం..
ఇక చివరి కౌంటింగ్లో ఫలితాలు ఎవరికి మొగ్గు చూపాయి అనే విషయానికి వస్తే.. పయ్యావుల కేశవ .. వైసిపి అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి పైన ఏకంగా 21, 704 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు ఇప్పటివరకు ఉన్న 25 ఏళ్ల సెంటిమెంట్ కి పయ్యావుల కేశవ బ్రేక్ కొట్టారని చెప్పాలి ...ఇక ఏంటా సెంటిమెంట్ అంటే ఉరవకొండలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రభుత్వంలో ఆ పార్టీ ఓడిపోతుందనే సెంటిమెంట్ 25 సంవత్సరాలుగా కొనసాగుతోంది.. ఉదాహరణకు 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ గెలవగా..ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . 2014లో వైసిపి అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలవగా.. ఆ ఎన్నికలలో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. 2019లో టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ గెలవగా ... ఏపీలో వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. ఇలా ఎన్నికల్లో ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని అంతా భావించారు .. కానీ 25 ఏళ్ల తర్వాత పయ్యావుల కేశవ గెలిచి అధికారంలో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు పయ్యావుల కేశవ.