ఏపీ: ఎగ్జిట్ పోల్స్ తర్వాత.. కాన్ఫిడెంట్గా సీఎం ఎవరో చెప్పిన వేణు స్వామి..!

Divya
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే.. ఎందుకంటే సినీ సెలబ్రెటీల రాజకీయ వ్యక్తిగత విషయాలలో ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జరిగిన నేపథ్యంలో ఏపీ సీఎం ఎవరు అనే విషయం పైన స్పందిస్తూ మరొకసారి ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కాబోయే సీఎం జగనే అంటూ కూడా తను కుండబద్దలు కొట్టి చెబుతున్నాను అంటూ తెలియజేస్తున్నారు. తాను రోజుకు ఒక మాట మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు అంటూ ఒక జ్యోతిష్యుడిని అంటూ ఒకసారి చెప్పిన మాట మీద నిలబడతానంటూ వెల్లడించారు వేణు స్వామి.
ఈ విషయాన్ని ఇప్పటికీ ఎన్నో 100 సార్లు చెప్పాను 2024లో కాబోయే సీఎం జగనే అన్నట్లుగా కూడా తెలియజేశారు. ఆయన జాతకం ప్రకారం ఆయనకు సీఎం అయ్యే యోగ్యం కూడా ఉందని జగన్ ది ఆరుద్ర నక్షత్రం అని 2023 నుంచి అష్టమ శని మొదలయ్యింది అంటూ తెలిపారు. అయితే అది మంచి స్థానంలో ఉన్నది కాబట్టి సీఎం అయ్యేది ఆయనే అంటూ చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాడ నక్షత్రం.. 2017 నుంచి 25 వరకు వీరికి శని ఉంది అంటూ తెలిపారు. ముఖ్యంగా టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ పార్టీది విజయమన్నట్టుగా వేణు స్వామి వెల్లడించారు..

సర్వేలు అందరూ కూడా ఇప్పుడు సీఎం జగన్ అవుతారని చెబుతున్నారని తాను మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు తెలిపారని తెలియజేశారు. మరో 17 ఏళ్ల పాటు ఆయన కదిలించే శక్తి ఏది కూడా లేదని వెల్లడించారు వేణు స్వామి.. 2019 లో గెలిచిన జగన్ 2024, 29 ఎన్నికలలో కూడా ఆయన సీఎం అవుతారంటూ కూడా వేణు స్వామి తెలియజేశారు. మరి ఈయన చెప్పేది వాస్తవం ఎంతవరకు అనేది జూన్ 4వ తేదీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: