ఏపీ : గెలిచేది ఆ పార్టీనే.. కర్ణాటక,తెలంగాణ లో ఇదే జరిగింది..!
ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కూడా బాగా ఇంఫ్యాక్ట్ చూపించింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం నవరత్నాలు ఇంపాక్ట్ చూపించాయని తెలియజేస్తున్నారు. మహిళల ఓట్లు చాలా కీలకంగా కాబోతున్నాయి అంటూ రిజల్ట్స్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయని షాకింగ్ గా రాబోతున్నాయని అన్నటువంటిది ఆయన అంచనాగా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి పార్దాదాస్ తెలియజేశారు. అదే సమయంలో పిడిఎస్ శర్మ .. ఎవరైతే సఫాలజిస్ట్ చెబుతున్నటువంటి లెక్కలలో ఏమిటంటే..
ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీలలో క్లియర్ గా చాలా స్పష్టత కనిపిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నే మళ్లీ అధికారం దక్కించుకుంటుందంటూ.. 97 నుంచి 114 స్థానాలను దక్కించుకుంటుందంటు అంచనా వేశారు. ఒరిస్సాలో కూడా బీజూ జనతా దళ్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అంచనా వేశారు. ముఖ్యంగా అక్కడ మహిళలు కూడా నమ్ముతున్నారని కూడా తెలియజేస్తున్నారు. 80 నుంచి 102 సీట్లతో అక్కడ జనతాదళ్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందని అంచనాని తెలియజేస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా ఈ విధంగా ఉంటుందని పిడిఎస్ శర్మ తెలియజేశారు. మరి అందరూ అనుకున్నట్టుగానే వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయం జూన్ 4వ తేదీన తెలియబోతోంది.