కేసీఆర్: మళ్లీ జగనే సీఎం.. కామెంట్స్ వైరల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు చాలా రసవత్తంగా సాగుతున్న సమయంలో ఇప్పటికే చాలామంది నేతలు ఇతర ప్రాంతంలోని నేతలు కూడా ఆయా పార్టీలు గెలుస్తాయంటూ మద్దతు తెలుపుతున్నారు.. ఇప్పుడు తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండవసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని కూడా ప్రకటించారు. ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న కెసిఆర్ మాట్లాడుతూ తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రాలో రెండవసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటూ కూడా వెల్లడించారు. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపారు కేసిఆర్.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి వస్తే ఇక్కడ చాలా తేడాగా ఉంటాయన్నారు.. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు కూడా వారు మంచి చేసే నాయకులనే కచ్చితంగా ఎన్నుకుంటారని.. ఇటీవలే బస్సు యాత్ర ముగింపు కారణంగా.. ఇవాళ సిరిసిల్లలో పర్యటిస్తున్నట్లు  టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య వెల్లడించారు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ కేంద్రంలో రోడ్డు షోలలో కేసీఆర్ పాల్గొనడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇటీవలే బస్సు యాత్రలోని మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ఈసారి చాలా హోరాహోరిగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా గెలవాలని కసితో ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతాలలో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది.. ఈసారి నేతలు గెలవాలని చాలామంది తమ తమ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. మరి ఈసారి అధికారంలో ఏ పార్టీ వస్తుందో తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.. మేనిఫెస్టోలో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ  ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు అనే విషయం పైన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం ఓటింగ్ కి మరో రెండు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్నది.. రేపటితో ప్రచారం కూడా పూర్తి కాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: