విజ్రుంభిస్తున్న కరోనా..ఆ దేశంలోనే అధికం..

Satvika
కరోనా మహమ్మారి ఇంకా కోరలు ఛాచుతుంది.. ఇప్పటికే ఎన్నో లక్షల మంది ప్రాణాలను తీసుకుంది.. ఇంకా కొంత మంది కరోనా తో పోరాడుతున్నారు.. ఒకవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న కూడా మరో వైపు కరోనా కేసులు అతి వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు తేరకుంటున్న ప్రపంచాన్ని మరోసారి గడగడ లాడిస్తుంది కోవిడ్. వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది.. దాంతో జనం భయంతో వణికిపోతున్నారు.

మరోసారి భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలో కొత్తగా 32 వేల 943 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి చైనా లో ఒక్క రోజులో ఇంత మందికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారి కాగా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 27 వేల 517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. పెరుగుతున్న వైరస్ ను అరికట్టేందుకు చైనా అధికారులు చర్యలు ప్రారంభించారు. మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ల ను విధించి కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు..

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా చైనాలో భారీ సంఖ్య లో కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. ప్రజా రవాణా ను అరికడుతూ లాక్‌ డౌన్ లతో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరెతర విషయాల కు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు..జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్ తయారీ ఫ్యాక్టరీ లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వేళ్లలేక తీవ్ర అవస్థలు పడ్డారు. మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు..అంతేకాదు, ఉద్యోగులు జాబ్ లను వదిలేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: