బస్సులో పుట్టిన బుడ్డోడికి.. సజ్జనార్ బంపర్ ఆఫర్?

praveen
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రోడ్డు రవాణా సంస్థ ను అటు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల అవసరాలను ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ సంస్థలో అనూహ్యమైన మార్పులు తీసుకు వస్తున్నారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. టీఎస్ ఆర్టీసీ ఎండీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. ఏకంగా జీవితకాలం పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. ఏంటి మీరు చెప్పేది నిజమేనా.. జీవితకాలం పాటు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చా.. అని షాక్ లో మునిగి పోయారు కదా.. అవును నిజంగానే జీవితకాలం పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. అయితే ఇది అందరికీ కాదు కేవలం ఒక బుడ్డోడికి మాత్రమే. అదేంటి కేవలం ఒక బుడ్డోడికి మాత్రమే ఇలాంటి ఆఫర్ ఎందుకు అనుకుంటున్నారు కదా.

 ఇటీవలే ఆర్టీసీ బస్సు లో బుడ్డోడు జన్మించాడు. దీంతో సజ్జనార్ కి ఆఫర్  ప్రకటించాడు. మహారాష్ట్ర కిన్వేట్ కు చెందిన రత్నమాల అనే మహిళ  ఇంద్రవెల్లి లోని బస్సు ఎక్కింది. ఈ క్రమం లోనే ఆదిలాబాద్ వెళుతుంది. అయితే అప్పటికే నిండు గర్భిణి అయిన రత్నమాల ఇక మార్గమధ్యంలోనే బస్సులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక బస్సు డ్రైవర్ వెంటనే బస్సును గుడిహత్నూర్ పీహెచ్సీకి తీసుకువెళ్లి తల్లి బిడ్డను వైద్యులకు అప్పగించగా ఇక ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బస్సులో పుట్టిన బుడ్డోడికి ఈ ఆఫర్ ప్రకటించారు సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: