నాన్న పిలుపే నా గెలుపు: వైఎస్ షర్మిల

Purushottham Vinay
నాన్న నా ఆస్తి ఇంకా నాన్న నా చిరునామా. ఇక నన్నెవరు అడ్డేది. నాన్న పిలుపే నా గెలుపు అంటున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఫాదర్స్ డే వేళ తన తండ్రిని తలచుకుని మరీ తన రాజకీయ కార్యాచరణను ప్రకటించేశారు.ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను పోటీ చేయనున్నట్లుగా షర్మిల చేసిన ప్రకటన ఒక విధంగా తెలంగాణా రాజకీయాల్లో పెద్ద సంచలనమే. ఆమె వైఎస్సార్ తనయగా తెలంగాణా ప్రజలకు బాగా పరిచయం.వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ గా ఆమె కాలికి బలపం కట్టుకుని తెలంగాణా రోడ్లను మైళ్ళకు మైళ్ళు కొలుస్తున్నా కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు మాత్రం అసలు పట్టడంలేదు. ఆమె బలం ఎంత అన్నది కూడా అసలు అంచనా లేదు. ఇక ఆమె తరఫున ఎంతమంది గెలుస్తారు అన్నది పక్కన పెడితే షర్మిల వచ్చే ఎన్నికల తరువాత అసెంబ్లీలోకి రాగలరా అన్న చర్చ కూడా ఇప్పుడు ఉంది.దానికి జవాబు అన్నట్లుగా ఎన్నికలకు ఏడాదిన్నర ముందే షర్మిల తాను పోటీ చేసే సీటుని కూడా వెతుక్కున్నారు. ఇక అక్కడ ఆమె కుదురుకుంటానని చెప్పేశారు. ఇక పాలేరు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతం. అంతే కాదు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఏరియా కూడా.


ఇక వైఎస్సార్ అభిమానులు దండీగా ఉన్న చోటు కూడా ఇదే కావడం విశేషం. అందుకే అన్నీ ఆలోచించి ఆమె ఇక్కడ పాగా వేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.పాలేరులో  TRS పార్టీ వీక్ గానే ఉంది అని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇపుడు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అని కూడా ఆమె ఊహించుకుంటున్నార్ట. కాబట్టి ఎలా చూసుకున్నా తెలంగాణాలోని 119 నియోజకవర్గాల్లో నూటికి నూరు శాతం తాను గెలిచే సీటు ఇదే అని షర్మిల చాలా బలంగా నమ్ముతున్నారు. ఇక తన ఆస్తి రాజన్న అని తండ్రిని ఆమె తలచుకున్నారు. భారం అంతా కూడా తండ్రి మీద పెట్టేశారు.ఇలా షర్మిల ఒక షాకింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే తెలంగాణాలో trs తో పాటు కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీలో ఉంటాయి. ఇక పాలేరులో అయితే వామపక్షాలకు కూడా బలం ఉంది. సీటు చూసుకోవడం కాదు జనాల అభిమానం కూడా చూసుకోవాలి. అంతే కాదు వైఎస్సార్ అభిమానులు అంతా కూడా బూతుల వద్ద నిలిచి ఓట్లు వేయించే పార్టీ యంత్రాంగం కూడా ఉండేలా చూసుకోవాలి. అపుడే షర్మిల అనుకున్న రాజకీయం అనేది పండుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: