సాయిరెడ్డి ఎఫెక్ట్: అశోక్ ఫ్యామిలీకి రూట్ క్లియర్..?

M N Amaleswara rao
అధికార బలాన్ని చూపించుకోవాలని అనుకుంటారో లేక...ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటారో తెలియదు గాని...వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది వైసీపీ నేతలు ఇంకా తమదే రాజ్యం అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ మాత్రం లేదు...అసలు రాజకీయంగా ఇంకా తమకు తిరుగులేదని, శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామనే పంథాలో పోతున్నారు. ఏదో చైనాలో మాదిరిగా జీవితాంతం జగన్ సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే తమకు నచ్చినట్లు రాజకీయం చేస్తున్నారు. అది కూడా కొందరు నేతలు మాత్రమే...కానీ కొందరు ప్రజల కోసం పనిచేస్తున్నారు.
వారిని పక్కనబెడితే మిగిలిన వారు ఇష్టమొచ్చినట్లు రాజకీయం చేస్తూ..ప్రతిపక్ష టీడీపీని అణిచి వేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. కాకపోతే ఇక్కడొక విషయం అర్ధం కావడం లేదు. టీడీపీ నేతలని అణిచి వేయాలని చూస్తూనే, వైసీపీ నేతలు రివర్స్‌లో షాకులు తినేలా ఉన్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల ఏం జరుగుతుందో గత ఎన్నికలో టీడీపీ నేతలకు బాగా అర్ధమైంది. అలా చేసే జగన్‌పై ఇంకా సానుభూతి పెంచి, వైసీపీకి భారీగా సీట్లు వచ్చేలా చేశారు.
ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు...టీడీపీపై కక్ష సాధిస్తూ, టీడీపీనే ఇంకా పైకి లేపుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి...టీడీపీ సీనియర్ అశోక్ గజపతి రాజుని ఏ విధంగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక్కడ తప్పు ఒప్పులని పక్కనబెడితే...క్లియర్‌గా రాజకీయంగా అశోక్‌ని దెబ్బకొట్టడమే విజయసాయి టార్గెట్ అని అందరికీ అర్ధమైంది.
కానీ అలా టార్గెట్ చేసి చివరికి అంతా రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. విజయసాయి అనవసరంగా అశోక్‌పై సానుభూతి పెంచారు. దాని వల్ల విజయనగరంలో అశోక్ బలం పెరిగిందే తప్ప తగ్గినట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో అశోక్ ఓడిపోయిన విజయనగరం పార్లమెంట్‌లో వైసీపీ బాగా వీక్ అయింది. అటు అశోక్ కుమార్తె అతిథి ఉన్న విజయనగరం అసెంబ్లీలో కూడా వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది. మొత్తానికి సాయిరెడ్డి మాత్రం అశోక్ ఫ్యామిలీ గెలవడానికి రూట్ క్లియర్ చేశారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: