తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు బహిరంగ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మిర్చి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని... మిగత పంటలకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పు న నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు రేవంత్ రెడ్డి.. మిర్చి పంట మంచిగా పడితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
తామర తెగులుతో తీవ్రంగా నష్టపోయారు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జిల్లాలో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి దాదాపు 8.633 కోట్ల నష్టం వచ్చిందని ఓ రేంజ్ రెచ్చి పోయారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారని నిలదీశారు రేవంత్ రెడ్డి. వెంటనే రైతులను అదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇక నైనా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు.. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.