వెస్ట్లో పవన్ ఎఫెక్ట్: ఆ ఇద్దరు రాజులకు ఇబ్బందేనా?
అయితే రాజుల వర్గం నుంచి ఇద్దరు నేతలు సైతం విజయం సాధించారు. నరసాపురం అసెంబ్లీలో ముదునూరి ప్రసాద్ రాజు, ఆచంటలో చెరుకువాడ శ్రీరంగనాథరాజులు గెలిచారు. ఇక నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణం రాజు గెలవడం, ఆయన వైసీపీకి యాంటీగా వెళ్ళడం...ఇలా అన్నీ విషయాలు తెలిసినవే. ఎమ్మెల్యేలుగా మాత్రం చెరుకువాడ, ముదునూరిలు గెలిచారు. ఈ ఇద్దరిలో చెరుకువాడ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు...నెక్స్ట్ టర్మ్ ముదునూరికి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ ఇద్దరు రాజులు స్ట్రాంగ్గానే ఉన్నారు. అయితే నెక్స్ట్ గాని వీరికి చెక్ పెట్టాలంటే వెస్ట్లో పలు కీలక మార్పులు జరగాలి. ప్రస్తుతానికి వీరికి టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది. కొద్దో గొప్పో ఆచంటలో చెరుకువాడకు టీడీపీ నేత పితాని సత్యనారాయణ కాస్త పోటీ ఇస్తున్నారు. కానీ నరసాపురంలో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంచార్జ్లు మారిన సరే ప్రయోజనం లేదు.