వైసీపీలో ఆ ఇద్దరు ఎంపీలకు హ్యాట్రిక్ ఛాన్స్..?
అంటే టీడీపీ కేవలం 20 ఎంపీ స్థానాలనే కౌంట్లోకి తీసుకోవాలి. అలా టీడీపీ కౌంట్లో లేనివి కడప, రాజంపేట ఎంపీ స్థానాలు. ఈ రెండు చోట్ల టీడీపీ గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయాయని చెప్పొచ్చు. ఇక మళ్ళీ ఈ రెండు చోట్ల గెలుస్తుందనే నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రెండు స్థానాలు టీడీపీకి ఏ మాత్రం కలిసిరావు. వైఎస్సార్ ఫ్యామిలీ ప్రభావంతో ఈ రెండు స్థానాలు మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి.
గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీదే గెలుపు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలవగా, కడప నుంచి అవినాష్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక మూడోసారి గెలవడం కూడా వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా ఈ రెండుచోట్ల టీడీపీకి నాయకులు లేరు. ఉండటానికి ఇద్దరు పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో వారు బరిలో దిగుతారా? లేక వేరే నేతలు ఏమన్నా బరిలో దిగుతారా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగిన మిథున్, అవినాష్ల హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేయడం కష్టమనే చెప్పొచ్చు.