జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా...!
ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి సమావేశం కావడం ఓ కీలక ఎత్తుగడగా అంతా భావిస్తున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల వివాదం దాదాపు రెండు నెలలుగా సాగుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు వాటిపై ఎలాంటి కామెంట్ చేసేందుకు కూడా చిరంజీవి ఆసక్తి చూపలేదు. పైగా.... తాను సినిమా పెద్దను కాదని కూడా కామెంట్ చేశారు. పరిశ్రమలో ఉన్న నలుగురిలో నేను కూడా ఒకడిని అని చెప్పేశారు. కానీ సడన్గా ఒక్కరే వచ్చి జగన్తో సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. త్వరలో ఖాళీ అవుతున్న వైసీపీ రాజ్యసభ స్థానాన్ని చిరంజీవితో భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వల్ల అటు మెగాస్టార్ అభిమానులను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్కు కూడా చెక్ పెట్టవచ్చు. అదే సమయంలో... కాపు సామాజిక వర్గం నేతలు, ఓటర్లను తన వైపు ఆకర్షించేందుకు కూడా జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.