నిమ్మల-ఏలూరి హ్యాట్రిక్ కాంబినేషన్?

M N Amaleswara rao
ఆ ఇద్దరు నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలు. ప్రజల సమస్యలని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి కృషి చేసే నేతలు. అధికార పార్టీలో లేకపోయినా ప్రజా బలం ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తూ...మళ్ళీ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యారు. అలా హ్యాట్రిక్‌కు రెడీ అయిన ఎమ్మెల్యేలు ఎవరో కాదు....టీడీపీలో ఉన్న నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావులు. ఈ ఇద్దరు పసుపు సైనికులు లెక్క ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన చంద్రబాబుని వదలకుండా ఆయనకు అండగా ఉంటారు. రాజకీయ విలువలకు కట్టుబడి ముందుకెళ్తారు. అందుకే వీరికి ప్రజా మద్ధతు ఎక్కువ.


2014లో పాలకొల్లు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల...అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో ప్రజలకు మంచిగా పనులు చేసి పెట్టారు. పాలకొల్లులో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందుకే ప్రజలు మళ్ళీ జగన్ గాలిని సైతం వ్యతిరేకిస్తూ నిమ్మలని పాలకొల్లులో గెలిపించారు. అయితే ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజల ఎమ్మెల్యేగా ముందుకెళుతున్నారు. సాధారణ జనంలో ఒక్కరిగా ఉంటారు..సింపుల్‌గా సైకిల్ మీద తిరిగేస్తూ ప్రజలని కలుస్తుంటారు. ఇక ఇలా ఉండే ఎమ్మెల్యేని ఎవరు కాదు అనుకుంటారు. అందుకే ఇప్పటికీ పాలకొల్లులో ఆయన బలం తగ్గలేదు. మళ్ళీ పాలకొల్లు ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. పాలకొల్లులో నిమ్మలకు హ్యాట్రిక్ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇక పర్చూరు నుంచి రెండుసార్లు గెలిచిన ఏలూరి సాంబశివరావు సైతం...ప్రజలతో మమేకమయ్యే నేత. 2014లో తొలిసారి గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టించారు. అందుకే 2019లో జగన్ గాలి ఉన్నా సరే...అపోజిట్‌లో దగ్గుబాటి వెంకటేశ్వరావు లాంటి బలమైన నాయకుడు ఉన్నా సరే ఏలూరి విజయం ఆగలేదు. రెండోసారి కూడా గెలిచారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తాను చదువుకున్న హార్టికల్చర్‌ని రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నారు. ఇలా నిత్యం ప్రజల కోసం నిలబడుతున్నారు. అందుకే పర్చూరులో ఏలూరికి హ్యాట్రిక్ రెడీ అయిందని చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: