ప్రాజెక్టులు సేఫ్గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!
ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారు కూడా. ఇక రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.... కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సైతం తప్పుబట్టారు. సరైన అవగాహన లేకుండానే కేంద్ర మంత్రి వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురు దాడి చేశారు కూడా. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అసలు ప్రాజెక్టుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిజర్వాయర్ల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు కూడా. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల వద్ద ఏవైనా నిర్వహణ లోపాలు ఉంటే... వెంటనే సరిదిద్ద్దాలని కూడా సూచించారు. ప్రస్తుతం రిజర్వాయర్ల పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్నారు వైఎస్ జగన్. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు.