అనంతపురంలో మల్లాది విష్ణును కీర్తిస్తూ ఫ్లెక్సీలు...!
అయితే ఈ వ్యాఖ్యలపై కమ్మ వర్గానికే చెందిన తెలంగాణ లోని మధిర మున్సిపాల్టీ కౌన్సెలర్ మల్లాది వేసు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వంశీ, నాని, అంబటి రాంబాబు లను భౌతికంగా నిర్మూలిస్తే వారికి రు. 50 లక్షలు తాను ఒక్కడినే ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు అనంతపురంలో మల్లాది వాసును కీర్తిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఇవి ఎవరు కట్టారన్నది మాత్రం తెలియదు.
అనంతపురంలోని బళ్లారి రోడ్డులో మాల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కొన్ని ఫ్లెక్సీ లలో అయితే హిందూపురం, ధర్మవరం అభిమానులు అని పెట్టారు. అయితే ప్రత్యేకంగా ఎవ్వరి పేర్లు రాయలేదు. మల్లాది వాసు ఫొటోతో పాటు మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫొటోలు పెట్టారు. అయితే వీటిని రాత్రికి రాత్రే కట్టేయడంతో అసలు సీసీ కెమేరాలకు కూడా దొరక లేదు. అసలు వీటిని ఎవరు కట్టారా ? అన్నది మాత్రం పోలీసులకు కూడా అంతు దొరకడం లేదు.
అయితే వీటిపై పోలీసులు టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదని చెపుతున్నారట. అయితే తెలుగు తమ్మళ్లు కూడా అసలు వీటిని ఎవరు కట్టార్రా బాబు ? అని తలలు పట్టుకుంటున్నారట. ఏదేమైనా మల్లాది వాసు ఇప్పుడు ఏపీ లో హీరో అయిపోయారు.