పీఆర్సీపై క్లారిటీ వస్తుందా... ఉద్యోగుల్లో టెన్షన్...!
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వరుసగా మూడో రోజు కూడా తమ నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయాల్లో విధులకు హాజరు అవుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చాశారు. ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక అంశంపై జగన్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే విషయంపై అధికారులతో జగన్ చర్చించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే జీతాల చెల్లింపు కూడా ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ ప్రకటన వల్ల కలిగే ఇబ్బందులపై కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే... 27 శఆతం మధ్యంతర భృతి ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోలేదు.