లోకేష్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు...?
అయితే నారా లోకేష్ ప్రసంగాలకు పెద్దగా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పెద్దగా చర్చ జరగక పోవడం అనేది తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకుడు నారా లోకేష్ దూకుడుగా ఉండటంతో సంతోషంగా ఉన్నా సరే రెండు నెలల నుంచి అని ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటి అనేది అర్థం కాక కాస్త ఇబ్బంది పడుతున్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణి తన తల్లి భువనేశ్వరి లక్ష్యంగా వైసిపి నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా కన్నీరుపెట్టిన సరే నారా లోకేష్ నుంచి ఘాటైన స్పందన రాకపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ఇటీవల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నమే ఎక్కువగా చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు కానీ నారా లోకేష్ మాత్రం మాట్లాడకపోవడం వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేయకపోవడం వంటివి కాస్త ఇబ్బంది గా కూడా చెప్పాలి.