చిరకాల మిత్రుని రాక.... అన్నీ కీలకమే...!
పుతిన్ పర్యటనలో ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా ముఖాముఖి సమావేశం కానున్నారు. భారత్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను మరింత వేగంగా అందించాలని రష్యాను భారత్ కోరనుంది. అదే సమయంలో రక్షణ రంగంలో పెట్టుబడులలతో పాటు ఆయుధాల కొనుగోలు విషయంపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. ఈ భేటీలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ సమీపంలోని కోర్వాలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో రెండు దేశాలు కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో 5 లక్షల ఏకే - 230 రైఫిళ్ల తయారీకి కూడా ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చేసింది. ఇక సైన్యం కోసం రెండు ఇంజిన్లు 226 - టీ హెలికాఫ్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా ఇప్పటికే రెండు దేశాల అధికారులు నిర్ణయించారు. మోదీతో భేటీ అనంతరం... రాత్రి 9 గంటల 30 నిమిషాలకు రష్యాకు పుతిని తిరుగు పయనమవుతారు.