భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్...!
ఐదు రోజుల్లోనే ఇప్పుడు ఏకంగా 20కి పైగా కేసులు భారత్లో నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే కొత్తగా ఏడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఏకంగా 9 మందికి ఓమిక్రాన్ వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఓమిక్రాన్ కేసుల సంస్థ 21కి చేరుకుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని ఆదర్ష్నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 9 మందికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు రాజస్థాన్ ప్రభుత్వ వైద్య అధికారులు వెల్లడించారు. వీరందరూ కూడా ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిసింది. కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో మొత్తం 16 ఓమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఒక్కరు తప్ప.. మిగిలిన వారంతా కూడా విదేశాల నుంచి వచ్చిన వారే అని కేంద్రం వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించింది.