కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి లేఖ రాసిన హరీశ్ రావు..

Purushottham Vinay
కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి  హరీశ్ రావు లేఖ రాశారు.ఆ లేఖలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించండి అని రాశారు. ఇక 12 వారాలతో రెండో డోస్కు ఇబ్బందిగా ఉందని తెలిపారు.అలాగే గతంలో మాదిరిగానే 4-6 వారాలకు తగ్గించండని కోరారు.ఇంకా హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు అలాగే హైరిస్క్ గ్రూప్లకు బూస్టర్ డోస్ వేయండని లేఖలో పేర్కొన్నారు.కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కూడా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ఇక రెండో డోస్కు 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కూడా లేఖ రాయడం జరిగింది.అలాగే వ్యవధి ఎక్కువగా ఉండటంతో రెండో డోస్ వేయడం కష్టంగా మారిందని చెప్పారు.వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు ఇంకా అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.కాబట్టి వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారిందని అన్నారు.మరీ ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది చాలా ఉన్నదన్నారు.

మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా కాని ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు చెప్పడం జరిగింది.అలాగే రెండో డోస్కు 12 వారాల గడువు ఉండటంతో కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఈ కారణాల దృష్ట్యా రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గించాలని సూచించడం జరిగింది.ఇక గడువును కనుక కుదిస్తే రెండో డోస్ వేసుకునేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 2.77 కోట్ల మంది కొవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా 3.77 కోట్ల డోసులను వేసినట్టు వెల్లడించారు.

ఇక ఇందులో 2.49 కోట్లు మొదటి డోస్ అని అలాగే 1.28 కోట్లు రెండో డోస్గా ఆయన పేర్కొన్నారు.ఇంకా అర్హులందరికీ కూడా టీకా రెండు డోసులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఆయన చెప్పారు.హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి రెండో డోస్ వేసి 8 నుంచి 10 నెలలు దాటిందని లేఖలో మంత్రి హరీశ్రావు గుర్తుచేయడం జరిగింది.ఇక వ్యాక్సిన్ తీసుకొని ఎక్కువ కాలం అవుతుండటం ఇంకా అలాగే కొత్త వేరియంట్లు వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి బూస్టర్ డోస్  వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రతిపాదించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: