తాలిబన్ అరాచకం : వేటాడి, వెంటాడి చంపేస్తున్నారు..!
తాలిబన్ పాలనతో అఫ్ఘనిస్తాన్లో ఆటవిక రాజ్యం మొదలయింది. కఠిన షరియ చట్టాల అమలు చేస్తూ మహిళల నుంచి పిల్లల వరకు అనే నియమ, నిబంధనలను అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకే బయపడుతున్నారు. అఫ్ఘనిస్తాన్ ఆకలి మంటలతో అలమటిస్తున్న తాలిబన్లు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే అఫ్ఘన్ను తమ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు మంచి పాలన అందిస్తామని చెప్పినా అది నిజం కాదని తేలిపోయింది. పగ, ప్రతికారాలతో రెచ్చిపోతున్నారు.
ప్రధానంగా మహిళలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి వస్త్రధారణపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం హయంలో పని చేసి అధికారులపై పగబట్టి కిడ్నాప్ చేస్తున్నారు. దొరకని వారిని క్రూరంగా చంపేస్తున్నారు. ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక వెల్లడించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నాలుగు ప్రావిన్స్లో సుమారు వంద మందికి పైగా కనిపించడం లేదని వీరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేసింది.