ప్రభుత్వ సంకల్పానికి తూట్లు...!
పాఠశాలలో ఆహారం సరిగ్గా ఉండటం లేదంటూ పిల్లలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. పేరెంట్స్కు వివరణ ఇవ్వాల్సిన పెద్ద సారు... తల్లిదండ్రులపై చిందులు తొక్కారు. పైగా మీకు పాఠశాల నచ్చక పోతే పోయి వేరే స్కూల్ లో జాయిన్ అవ్వండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగధంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులపైనే ఉందని... కానీ... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు తల్లిదండ్రులు. ఈ విషయం పై జిల్లా, మండల స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకొని పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.