ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాబును వ‌దిలేలా లేరే...!

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్ కు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో పెద్ద థ్రెడ్ ఉంది. ఎన్టీఆర్ ఎప్పటికైనా తన తనయుడు లోకేష్ కు రాజకీయంగా పోటీకి వస్తాడు అన్న సందేహం అయితే చంద్రబాబుకు ఉంది. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే లు కాస్త అనుచితంగా మాట్లాడారు. దీంతో టీడీపీ శ్రేణుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరకు నందమూరి కుటుంబం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా కలిసికట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరి వైసీపీ ఎమ్మెల్యేల‌ కు వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒక వీడియోలో ఎవరి పేరు ప్రస్తావించకుండా రాజకీయ నాయకులు అందరూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచి ఉండాలని ఆకాంక్షించారు. ఈ వీడియో ఈ వీడియోలో ఆయన భువనేశ్వరి పేరు కానీ ... చంద్రబాబు పేరు కానీ ప్రస్తావించలేదు. అలాగని వైసీపీకి , జగన్ కు వార్నింగ్ కూడా ఇవ్వలేదు. అయితే జూనియర్ అలా మాట్లాడటం నచ్చని తెలుగు తమ్ముళ్లు జూనియర్ ను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.

తెలుగుదేశం నేత‌లు జూనియర్ ను టార్గెట్ చేస్తూ ఉండడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కుప్పం మునిసిప‌ల్ ఎన్నికల్లో రెండు రోజులకు ముందు టిడిపికి ఓట్లు వేయ‌వ‌ద్ద‌ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరు తో రిలీజ్ అయిన బహిరంగ లేఖ పార్టీలో పెద్ద సంచలనానికి కారణమైంది.

ఏదేమైనా టిడిపి వాళ్ళు తమ చర్యలతో జూనియర్ అభిమానులను ఆ పార్టీకి దూరం చేస్తున్నారు అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి సున్నితమైన విషయాలను ఎలా డీల్ చేస్తారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: