యూపీ పోరు: ఆప్తో అఖిలేష్ పొత్తు...!
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీని సొంతం చేసుకోవాలంటే... ప్రస్తుతం ఒంటరిగా సాధ్యం కాదని... పొత్తు తప్పని సరి అని భావించినట్లు ఉన్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అందుకే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అఖిలేష్. గతంలో కాంగ్రెస్, బీఎస్పీలతో కలిసి పోటీ చేసిన అఖిలేష్... ఈ సారి మాత్రం తప్పకుండా అధికారం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యానాథ్ నేతృత్వంలోని కమలం పార్టీని గద్దె దింపాలని అన్ని పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యోగీ హయాంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అఖిలేష్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే అఖిలేష్ ప్రకటించారు. అయితే సీట్ల పంపకంపై మాత్రం ఇంకా రెండు పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయని అఖిలేష్ వెల్లడించారు.