చెరువులు, కుంటలు ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చ
ఎన్ని రెవెన్యూ కుంటలు, చెరువులు ఆక్రమణలు జరిగాయని.. ఆక్రమణలు జరుగుతుంటే గ్రామాల్లో ఉన్న వీఆర్వోలు, సర్వేయర్లు సేవలు ఎందుకు వినియోగించుకోవడం లేదు అని ప్రశ్నించారు. రెవెన్యూ, పంచాయితీలలో ఉన్న కుంటలను సదుద్దేశంతో పూర్వీకులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కానీ, వీటిన ప్రైవేటు వ్యక్తుల పేర్లపై వెబ్ పోర్టింగ్ చేసేశారు అని చెప్పారు. అలా చేసిన అధికారులపై ఎలంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు మహిధర్ రెడ్డి.
ఈ ప్రశ్నలకు డిప్యూటీ సిఎం మంత్రి ధర్మాన కృష్ణదాసు సమాధానమిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1216 గ్రామాల్లో 5236ఎకరాలు ఆక్రమలకు గురయ్యాయి అంటూ వివరించారు. వెయ్యి కోట్ల రూపాయలతో మూడు దశల్లో సర్వే చేయిస్తున్నామని.. ఇది గనుక పూర్తయితే ఈ సమస్యల్లో చాలా వరకూ పరిష్కారం అవుతాయంటూ వెల్లడించారు. అయితే, ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండిపోవడంతో గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికావడ వల్లే వరదలు ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చెరువులు, కుంటలపై అక్రమంగా నిర్మించిన కట్టాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.