ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!
రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వం భూములను పంచి ఇచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నుంచి కూడా ఇళ్ల బకాయిలు ఉన్నాయి. అయితే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టిన జగన్ సర్కార్... వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించింది. దీని ద్వారా లబ్దిదారులకు కూడా లాభం జరుగుతుందని.... భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా ప్రభుత్వాధికారులు వెల్లడిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకోవటం ద్వారా ... వారి ఆస్తులను వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇప్పటి వరకు లబ్దిదారులుగా ఉన్న వీరంతా కూడా ఇకపై ప్రభుత్వ హక్కుదారులుగా గుర్తింపు పొందుతారని కూడా అధికారులు వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద మూడు ధరలను నిర్ణయించింది ప్రభుత్వం. గ్రామాల్లో 10 వేల రూపాయలు, పట్టణాల్లో 15 వేల రూపాయలు, నగరాల్లో 20 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా లబ్దిదారులు తమకు కేటాయించిన ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే... కొనుగోలు చేసిన వారి నుంచి రెట్టింపు మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. ఈ పథకం ద్వారా కనీసం 5 వేల కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.