ఢిల్లీ కాలుష్యం.. ఇక రోజూ విచారణ..!
వాయు కాలుష్యం తీవ్రత ఉన్నంత కాలం ఈ విషయాన్ని దాదాపు ప్రతిరోజూ విచారించాలని ధర్మాసనం తెలిపింది. వచ్చే రెండు మూడు రోజులు కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ లోగా కాలుష్యం 100కు చేరితే కొంత నిషేధాన్ని ఎత్తివేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. యంత్రాలతో పంట కోతలు.. మొదళ్ల నుంచి జరగని కారణంగానే వ్యర్థాల దహనం చేస్తున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ న్యాయవాదిగా, న్యాయమూర్తులుగా దీనిపై చర్చిస్తున్నాం అని వెల్లడించారు. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది ? అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. వారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు చేయండి. ఇది ఎందుకు జరగదు అని ప్రశ్నించారు. పంట వ్యర్థాల దహనం అంశం తాను చేపడితే 101 వాదనలు వస్తాయి.. కానీ ఫలితం ఉండదని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఢిల్లీలో గత కొంత కాలంగా తీవ్ర కాలుష్యం వెలువడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలుష్యం తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో అవసరం అయితే ఢిల్లీ పరిధిలో లాక్డౌన్ విధించాలని కోర్టు సూచించింది.