ఢిల్లీ కాలుష్యం.. ఇక రోజూ విచార‌ణ‌..!

Paloji Vinay
ఢిల్లీ వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. గత కొన్ని రోజుల నుంచి గాలి నాణ్యత క్రమంగా మెరుగువతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు. ఢిల్లీ న‌గ‌రానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆమోదయోగ్యమైన స్థాయి ఏమిటో నిర్వచించాలని అధికారుల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారి చేసింది. పిటిషన్ పై తాము తుది ఆదేశాలు ఇస్తామని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది.

 వాయు కాలుష్యం తీవ్రత ఉన్నంత కాలం ఈ విషయాన్ని దాదాపు ప్రతిరోజూ విచారించాల‌ని ధర్మాసనం తెలిపింది. వచ్చే రెండు మూడు రోజులు కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాల‌ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ఈ లోగా కాలుష్యం 100కు చేరితే కొంత నిషేధాన్ని ఎత్తివేయవచ్చని  సుప్రీంకోర్టు తెలిపింది. యంత్రాలతో పంట కోతలు.. మొదళ్ల నుంచి జరగని కారణంగానే వ్యర్థాల దహనం చేస్తున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ న్యాయవాదిగా, న్యాయమూర్తులుగా దీనిపై చర్చిస్తున్నాం అని వెల్ల‌డించారు. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది ? అని ప్ర‌శ్నించిన  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. వారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు చేయండి. ఇది ఎందుకు జరగదు అని ప్ర‌శ్నించారు. పంట వ్యర్థాల దహనం అంశం తాను చేపడితే 101 వాదనలు వస్తాయి.. కానీ ఫలితం ఉండదని సీజేఐ అసహనం వ్య‌క్తం చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.   అయితే, ఢిల్లీలో గ‌త కొంత కాలంగా తీవ్ర కాలుష్యం వెలువ‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాలుష్యం తీవ్ర త‌రం అవుతున్న నేప‌థ్యంలో అవ‌స‌రం అయితే ఢిల్లీ ప‌రిధిలో లాక్‌డౌన్ విధించాల‌ని కోర్టు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: