ధీమాతో ఉన్న అంబటి...?
బద్వేలు ఎన్నికల్లో గెలుపు ఖాయం అని అందరికీ తెలుసు అని అన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అందరూ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలని ప్రచారం చేస్తున్నాం అని అన్నారు. ఏ ప్రలోభాలు లేకుండా ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీకు అందిస్తున్నామని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ , బిజెపి లకు ఎందుకు ఓట్లు వేయాలి అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛీల్చింది అని ఇప్పుడు అంతరించిపోతోంది అని ఎద్దేవా చేసారు. బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ఉనికే లేదని అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. టీడీపీ , జనసేన పోటీ పెట్టకుండా లోపాయకారి ఒప్పందం.. లాలూచీ పడ్డారని అన్నారు. పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలి అని ఆయన కోరారు. బద్వేల్ ప్రజలు చక్కని తీర్పు ఇవ్వనున్నారు అని ధీమా వ్యక్తం చేసారు.