కేసీఆర్ Vs. ఈటెల : ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే హుజూరాబాద్లో కారుకు పంక్చరే..!
కేసీఆర్ బహిరంగ సభలు పెట్టిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ విజయం సాధించింది. ఆయన దుబ్బా క ఉప ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లలేదు. అక్కడ బాధ్యత అంతా మంత్రి హరీష్ రావు మీదే పెట్టారు. అక్కడ టీఆర్ ఎస్ ఓడిపోయి బీజేపీ విజయం సాధించింది. కేసీఆర్ కూడా దుబ్బాక ఓమటి ఊహించలేదు. అయితే కేసీఆర్ హుజూర్ నగర్ , నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లారు. ఆ రెండు చోట్ల కూడా టీఆర్ ఎస్ గెలిచింది.
ఇక ఇప్పుడు హుజూరా బాద్లో కేసీఆర్ ఓడిపోతే హరీష్కు ఎన్నికల్లో పార్టీని గెలిపించే సీన్ లేదని క్రియేట్ చేస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. మరో టాక్ ప్రకారం కేసీఆర్ పార్టీ ఎక్కడ అయితే ఓడిపోతుందో ఆ విషయం ముందుగానే గ్రహించి అక్కడ ప్రచారానికి వెళ్లడం లేదని మరో టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఇక్కడ టీఆర్ ఎస్ ఓడిపోతే మాత్రం అది హరీష్ రావు అసమర్థత అని టీఆర్ ఎస్లో కొందరు అనే ఛాన్స్ ఉంది. బీజేపీ మాత్రం కేసీఆర్ సెంటిమెంట్తో తాము మరోసారి గెలుస్తామని ధీమాతో ఉంది.