బద్వేల్లో వైసీపీ టార్గెట్ ఆ ఒక్కడే...!
ఇక్కడ వైసీపీ గెలుపు ఏకపక్ష మే .. అయితే ఆ పార్టీ ఇప్పుడు మెజార్టీ మీదే టార్గెట్ పెట్టుకుంది. అయితే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ ఉప ఎన్నికను కాస్త ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ ఓడిపోయినా ఏ 20 వేల ఓట్లో వస్తే అది ఆదినారాయణ ఇమేజ్ ను చాటి చెపుతుంది. అందుకే ఆయన ఇక్కడ గట్టిగా పాగా వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అందుకే వైసీపీ వాళ్లు ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం లో ప్రధానంగా ఆది నారాయణ రెడ్డినే టార్గెట్ గా చేసుకుని మరీ విమర్శలు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదినారాయ ణరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆదినారాయణరెడ్డిని బద్వేలు ప్రజలు తరిమి కొట్టాలని.. వైసీపీ నుంచి గెలిచి, మంత్రి పదవి కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడని తీవ్రంగా విమర్శించారు. ఇక ఆది నారాయణ గతంలో దళితులకు నాగరికత లేదని మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం ఆది నారాయణ రెడ్డి నే తన ప్రచారంలో ప్రధానంగా విమర్శిస్తూ వస్తున్నారు.