బోషడీకే మాకు నోటీసులు ఇస్తాడా... టీడీపీ నేత కామెంట్స్

Sahithya
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పోలీస్ శాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్న బోషడీకే మాకు నోటీసులిస్తున్నాడు అంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ దద్దమ్మకు, చవటకు నిజంగా దమ్ము, ధైర్యముంటే ఏపీలో సాగుతున్న మాదకద్రవ్యాలు, గంజాయిపై దాడి చేసిన ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులివ్వాలి అని ఆయన సవాల్ చేసారు. రాష్ట్రంలోని గంజాయి సాగు, రవాణా వ్యవహారాన్ని, దాని స్మగ్లర్లను ప్రశ్నించిన తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, ఉత్తరప్రదేశ్ పోలీసులకు కూడా నోటీసులిస్తారా? అని నిలదీశారు.
ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటిసులిచ్చి, వారిని ప్రశ్నించగల దమ్ము, ధైర్యం తాడేపల్లి పెదపాలేరుకు, ఈ ప్రభుత్వానికి ఉన్నాయా?  అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల చేతిలోదాడికి గురైన నల్గొండ పోలీసులకు నోటిసులివ్వగల ధైర్యం తాడేపల్లి పాలేరుకు ఉందా?  అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో గంజాయి స్మగ్లర్ల చేతిలో బాంబు దాడులకు గురైన తమిళనాడు పోలీసులకు నోటిసులివ్వగలడా? అంటూ ఏపీ నుంచి వచ్చిన గంజాయిని పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులను ప్రశ్నించగలడా? అంటూ నిలదీశారు.
పిరికిసన్నాసిలా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, తనమాట వినే పోలీసులతో టీడీపీ నేతలకు నోటిసులిప్పిస్తాడా? అని ఆయన విమర్శలు చేసారు. తాడేపల్లి పెదపాలేరు, పబ్జీ ఆడుకునే తాడేపల్లి దొర , వారి పోలీసులతో ఇచ్చే నోటీసులుమాకు చిత్తుకాగితాలతో సమానం అన్నారు ఆయన. నిజంగా ఈ చేతగాని దద్దమ్మలకు దమ్ము, ధైర్యముంటే రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి సాగుని, మాదక ద్రవ్యాల వ్యవహారాన్నికట్టడిచేయాలి అని కోరారు. నర్సీపట్నం పోలీసులు వారి ఏరియాలో సాగవుతున్నగంజాయిని పట్టించుకోకుండా, పోలోమని ఎగేసుకొని గుంటూరు వచ్చి మరీ మాజీ మంత్రికి నోటీసులిచ్చారు అన్నారు. ఖాకీ డ్రస్ వేసుకున్న దొంగల్లా అర్థరాత్రి టీడీపీ నేతల ఇళ్ల ముందుకు రావడం కాదు.. ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడారో కాస్త ఇంగితంతో ఆలోచించుకుంటే మంచిది అని సూచించారు. నక్కా ఆనంద్ బాబు గారు నిన్న మీడియాతో మాట్లాడినదానిలో తప్పేముందో నర్సీపట్నం పోలీసులు చెప్పాలి అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: