ఆకలి సమస్యను అర్థం చేసుకొని భారత్..!

MOHAN BABU
ప్రపంచ ఆకలి సూచిక ర్యాంకింగ్స్ పై భారత్ చేసిన ఆరోపణల్ని జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ వెల్త్ హంగర్ హైప్ అర్థరహితమని పేర్కొంది. ఆకలి సమస్య, పోషకాహారలోపం రెండింటికీ తేడా ఉందని, అవి రెండూ ఒకటేనని భారత్ వాదిస్తోందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ ఏడాది జి హెచ్ ఐ మొత్తం 116 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదల చేయగా  అందులో భారత్ కు 101 వ స్థానం దక్కింది దీనిపై మోడీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జి హెచ్ ఎం రూపకల్పనలో ఉపయోగించిన మెథడాలజీ అశాస్త్రీయంగా ఉందని ఆరోపించింది. టెలిఫోన్ లో ఏవో నాలుగు ప్రశ్నలు అడిగి అందులో ఒక దాన్ని పట్టుకొని జి హెచ్ ఐ ర్యాంకింగ్స్ విడుదల చేశారని కేంద్రం తప్పుబట్టింది.

నివేదికను రూపొందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ఆరోపణల్ని జి హెచ్ ఐ ఖండించింది. టెలిఫోన్ ద్వారా ఒపీనియన్ పోల్ నిర్వహించి భారత్ కు ర్యాంకింగ్ ఇవ్వలేదని జిహెచ్ఐ సలహాదారు మిరియం విమర్స్ జాతీయ ఆంగ్ల దినపత్రిక కు రాసిన ఈమెయిల్లో పేర్కొన్నారు. జి హెచ్ఐ ర్యాంకింగ్ పై భారత్ చెత్త ఆరోపణలు చేసిందని కొట్టిపారేశారు. దేశంలో ఆకలి సమస్యను భారత్ సరిగా అర్థం చేసుకోలేక పోతుందని, పోషకాహారం పొందలేని వారి సంఖ్య భారత్ లో పెరుగుతున్న విషయం పై జి హెచ్ ఐ నివేదిక సూచిస్తోందని అన్నారు. ఆహార అభద్రత పై టెలిఫోన్ ద్వారా జరిపిన ఒపీనియన్ పోల్స్ ను జిహెచ్ఐ ర్యాంకింగ్లో పరిగణలోకి తీసుకోలేదు. ప్రతి దేశంలో ఆహార పంపిణీ, సమతుల్యత గణాంకాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నామని విమర్స్ తెలిపారు.

ఎత్తు,బరువు ఆధారంగా పోషకాహార సూచికను తయారు చేసి ఉండాల్సిందని కేంద్రంలోని మహిళ, శిశు అభివృద్ధి శాఖ  జీ హెచ్ ఐ సూచికను తప్పుబట్టింది. పోషకాహార లోపం, ఆకలి సమస్య రెండు వేరు వేరు. దేశంలో ఆహార కంపెనీని బట్టి ఆకలి సమస్యలు గణించవచ్చు. అంతేగాని ఇది ఎత్తుకు తగిన బరువు అనేది కాదు అని అన్నారు. ప్రపంచ ఆకలి సూచిక ర్యాంకింగ్స్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో తప్పుబట్టారు. దేశంలో ప్రజలందరికీ సురక్షితమైన పోషకాహారం, సరిపడా ఆహారం లభిస్తుందా? లేదా? అన్నది జిహెచ్ఐ పరిగణలోకి తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: