పెగ్గు మీద పెగ్గేశారు.. బీరు మీద బీరేశారు..!
తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో మూడేళ్ల కిందటి దాకా ఐఎంఎల్ సేల్స్ కంటే బీర్ల అమ్మకాలు డబుల్ ఉండేవి. ఆ తర్వాత ఐఎంఎల్ కంటే బీర్ల సేల్స్ తగ్గిపోయాయి. కరోనా టైమ్లో బీర్ల వాడకం చాలా వరకు పడిపోయింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ కూడా బీర్ల ధరలను పెంచింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. అయితే ఇటీవల కరోనా తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు ఒక బీరుపై 10 రూపాయలు తగ్గించడంతో అనూహ్యంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఇందులో దసరా సందర్భంగా మూడు రోజుల్లోనే దాదాపు సగం వరకు అమ్మకాలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ జిల్లాలో రూ. 103 కోట్లు విలువైన మద్యం సేల్స్ జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 1,17,000 కేసుల ఐఎంఎల్, 1,23,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత నల్గొండలో రూ. 59 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. హైదరాబాద్లో రూ. 43 కోట్లు, మెదక్లో రూ. 41 కోట్లు, మహబూబ్నగర్లో రూ. 39 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తానికి ప్రభుత్వ ఖజానాకు దసరా మస్త్ మస్త్గా కిక్కు ఇచ్చిందని ఎక్సైజ్ శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది.