ఏపీ కాంగ్రెస్ కు చంద్రబాబే పెద్ద దిక్కు...? ఆయన కూడా వెళ్తున్నాడా...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడే క్రమంలో కొంతమంది కీలక నాయకులు తనవైపు తిప్పుకునేందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకులను చంద్రబాబు నాయుడు ఎక్కువగా టార్గెట్ చేశారని వార్తలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్న ఏ ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు వదిలి పెట్టడం లేదని వాళ్ళతో అవసరమైతే స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా మారారు అనే విషయం కూడా ఈ మధ్యకాలంలో వినబడుతోంది. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు విఫలం కావడం అలాగే వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవడం తో చంద్రబాబు నాయుడు వాళ్లని పార్టీలోకి తీసుకునే కీలక పదవులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ విషయంలో చంద్రబాబు చాలా సానుకూలంగా ఉన్నారని వస్తే కచ్చితంగా ఆయన అడిగిన చోట సీటు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు.
శైలజానాథ్ విషయంలో అనంతపురం జిల్లా నాయకులు కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆయన అడిగిన చోట సీటు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారని అవసరం అయితే అక్కడ ఉన్న నాయకులను పక్కన తప్పించడానికి కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆయనతో ఇబ్బందులు నాయకులతో స్వయంగా తానే మాట్లాడి పరిస్థితిని మార్చేందుకు రెడీ అయ్యారు అని అంటున్నారు. ఒకవేళ శైలజానాథ్ రావడానికి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ అవసరమైతే పార్టీ నుంచి పంపడానికి కూడా రెడీగా ఉన్నారని ఈ విషయంలో చంద్రబాబులో ఎక్కడా కూడా వెనక్కు తగ్గే ఆలోచన లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: