నై తెలంగాణ అన్న వారిని చంకన చేర్చుకున్నారు !

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ములోని వినవంక మండలం మామిడాలపల్లి లో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వివేక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. బి ఫార్మసీ చదువుకుంటున్న అమ్మాయిని ఉద్యోగాలు కావాలని అడిగితే ఆడపిల్ల అని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రఘునందన్ రావు . దానికి మనం బాధలు తీర్చుకోవాల వద్దా ?
ఆడపిల్ల ఉద్యోగాలు కావాలంటే కొడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.
ఇంకో పక్క ఎర్రబెల్లి, నల్లబెల్లి, మోత్కుపల్లి లను ఉద్యోగాలు ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారని నిప్పులు చెరిగారు. వాళ్ళు కెసిఆర్ ని ఎంత తిట్టారో మీరంతా చూసే ఉంటారని గుర్తు చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  ఆ మోత్కుపల్లి నీ కెసిఆర్ పొగుడుతున్నారని చురకలు అంటించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అవకాశం, అధికారం కోసం నై తెలంగాణ అన్నవాల్లని చంకన చేర్చుకుంటారని..  ఉద్యమకారులను రోడ్డు మీద వేస్తారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. హరీష్ ప్రతి మాటకు సమాధానం చెప్తానని హెచ్చరించారు.
అటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఈటల రాజేందర్. కావాలనే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని... అసలు తా ను రాజీనామా చేసే యోచనలో లేకున్నా.. తన ఆత్మ గౌరవం పై దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. 2023 వరకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కథం  అవుతుందని హెచ్చరించారు ఈటల రాజేందర్. అన్యాయానికి..  న్యాయానికి జరుగుతున్న ఈ సమరంలో కచ్చితంగా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: