భారత్పై పెత్తనం చేసేందుకు చైనా కీలక ఎత్తులు...!
చైనా-భూటాన్ల మధ్య జరిగిన సరిహద్దు సమస్య పరిష్కారానికి కీలక ఒప్పందం చేసుకున్నాయి రెండు దేశాలు. మూడు దశల చర్చల ద్వారా.... సరి హద్దు సమస్య పరిష్కరించుకునేందుకు రెండు దేశాల అధికారులు ఇప్పటికే సమావేశమయ్యారు. సమస్య పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. భూటాన్ దేశంలో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలే పరిష్కారం అని తాజాగా చైనా వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా ఇప్పటికే భూటాన్ దేశ విదేశాంగ శాఖ అధికారులతో ఒక దఫా చర్యలు కూడా జరిపారు డ్రాగన్ కంట్రీ అధికారులు. ఈ నెల 14వ తేదీన జరిగిన వర్చువల్ మీటింగ్లో చైనా రాజధాని బీజింగ్, భూటాన్ రాజధాని ధింపూ మధ్య బంధం మరింత బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. దాదాపు 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును భూటాన్తో చైనా పంచుకుంటోంది. అయితే తొలి నుంచి రెండు దేశాల మధ్య బోర్డర్ వార్ జరుగుతూనే ఉంది.