పొత్తు కుదిరేనా! : జగన్ కోసం జనం ?
ఈ నేపథ్యంలో... జనం ఎటువైపు?:
వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీ లో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొందరు సీనియర్లు పోటీకి దూరం కానున్నారు. ఇంకొందరిని జగనే దగ్గరుండి తప్పించనున్నారు. ఇదే సందర్భంలో ఇంకొందరు పార్టీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ జగ న్ వెంట జనం ఉంటారా లేదా అన్న సంశయం ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే పాలన పరంగా ఇప్పటికే జగన్ మంచి పట్టు పెంచుకోలేకపోతున్నారు. డబ్బులు పంచడమే తన పాలనకు పరమావధి అని నిరూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయిస్తే ఇంకొన్ని మంచి పనులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణపై కానీ రోడ్లు నిర్మాణంపై కానీ జగన్ అస్సలు శ్రద్ధ వహించలేదు అన్నది ఓ ఆరోపణ. అదే నిజం కూడా! జనసేన నేతృత్వంలో కొన్ని నిరసనలు జరిగాక దసరా తరువాత రోడ్డు పనులు చేపడతామని ఇందుకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని చెప్పారు. ఆ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో?