పవన్ కోసం బాబు త్యాగాలు... క్లీయర్గా కనిపిస్తోందిగా...!
ఈ క్రమంలోనే పవన్తో జోడీ కట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారు.. ఇక, ఇటీవల పవన్ కూడా రాష్ట్ర `భవిష్యత్తు` కోసం .. ఖచ్చితంగా ఎవరితో అయినా.. కలిసి పనిచేసేందుకు రెడీ అని పేర్కొన్నారు. అంటే.. పవన్ కూడా `సంకేతాలు` పంపేశారు. ఇక, మిగిలింది ప్రకటనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. దీనిపై ఇప్పటికీ అనేక సందేహాలు.. ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులను పలువురు ప్రస్తావిస్తున్నారు. వీటిలో ప్రధానంగా.. రెండు మాసాల కిందట వరకు.. జోరుగా వ్యవహరించిన నారా లోకేష్.. జగన్పైనా.. ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన సైలెంట్ అయ్యారు.
ఇది వ్యూహం ప్రకారం చేస్తున్నదేనని విశ్లేషకుల మాట. పవన్ వాయిస్ హైలెట్ అవ్వాలంటే.. లోకేష్ వాయిస్ తగ్గాలనేది.. `ఒప్పందం`గా ఉందని అంటున్నారు. అదేసమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. పవన్కు ఓ వర్గం మీడియాలో ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఆయన మాట్లాడినా.. పె ద్దగా కవర్ చేయలేదు.కానీ.. టీడీపీతో `పొత్తు` కుదిరేసరికి మాత్రం. పవన్ను మీడియా హైలెట్ చేస్తోంది. ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇదీ చంద్రబాబు వ్యూహంలో భాగమేనని, దీనిని బట్టి.. ఈ రెండు పార్టీలూ కలిసి పోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే.. మరోవైపు.. కీలక కాపు, క్షత్రియ నేతలను టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లేలా.. చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.
ఫలితంగా.. పవన్ బేస్ పెరిగి.. కాపు వర్గం అంతా ఆయనకు అనుకూలంగా మారుతుందని.. భావిస్తున్నారట. ఇదేసమయంలో జగన్కు ఈ వర్గాలను దూరం చేసేందుకు.. పవన్తోనే వ్యూహాత్మకంగా పావులు కదిపిస్తున్ఆనరని అంటున్నారు. ఇలా.. మొత్తంగా పవన్ కోసం.. బాబు వ్యూహాత్మక త్యాగాలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.